డ్రైవర్ లేకుండా పొలం దున్నే ట్రాక్టర్ను ఎప్పుడైనా చూశారా? వింటుంటేనే ఆశ్చర్యం వేస్తుంది కదూ. కానీ తెలంగాణ యువ ఇంజినీర్లు చేసి చూపించారు. వరంగల్ జిల్లా హసన్పర్తిలోని కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు.. ప్రొఫెసర్ల సాయంతో సెల్ఫోన్ సాయంతో కంట్రోల్ చేస్తూ పొలం దున్నే ట్రాక్టర్ను ఆవిష్కరించారు. డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ నడవటం చూసి తాను ఆశ్చర్యపోయానంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ మేధాశక్తితో తెలంగాణ యువ ఇంజినీర్లు కొత్త ఆవిష్కరణను ప్రపంచానికి చాటిచెప్పారని ప్రశంసించారు.