జగన్ అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రానికి కొత్త కంపెనీలు రావని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో.. కాపు, బలిజ సామాజిక వర్గీయులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. ధరలన్నీ పెంచేశారని మండిపడ్డారు.