ఆరుగాలం పండించిన పంటను కోయడం ఒక టాస్క్ అయితే.. వాటిని అమ్ముకోవడం మరో టాస్క్గా మారిందని రైతులు వాపోతున్నారు. లోడింగ్ చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లుల వద్దకు తీసుకువస్తే.. తాము చెప్పేంత వరకు లోపలకు రావొద్దని మిల్లర్లు రోడ్డుపైనే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు ఏ-గ్రేడ్ ఉంటే.. మిల్లులకు వచ్చాక బి-గ్రేడ్ అంటూ తరుగు తీయడం దారుణమంటున్నారు.