ఇండో బంగ్లాదేశ్ సరిహద్దులో పశ్చిమ బెంగాల్ నుంచి రూ. 13 కోట్ల విలువైన పాము విషాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు స్వాథీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్కు చెందిన ఇద్దరు స్మగ్లర్లు రూ.13 కోట్ల విలువైన పాము విషంతో అక్రమంగా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. దీనిపై బీఎస్ఎఫ్ బలగాలకు సమాచారం అందించి నిఘా పెట్టారు. పశ్చిమ బెంగాల్ హిలి ప్రాంతంలోని పహన్పరా గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత స్మగ్లర్లు అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా బీఎస్ఎఫ్ జవాన్లు వారిపై కాల్పులు జరపారు. దీంతో స్మగ్లర్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు.