సత్యసాయి జిల్లా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో.. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ క్రికెట్ ఆడి సందడి చేశారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, ధర్మవరంలో క్రికెట్ పోటీలను వారు పర్యవేక్షించారు.