అఫ్గానిస్థాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో బుధవారం తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. బాగ్లాన్ నగరానికి 164 కిలోమీటర్ల దూరంలో 121 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తొలుత6.4 మాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చిందని ఈఎంఎస్ఈ ప్రకటించడం గమనార్హం. అఫ్గానిస్థాన్లో వచ్చిన భూకంపం ప్రభావం భారత్ వరకు చూపింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోనూ భూప్రకంపనలు వచ్చాయి. కాగా, అఫ్గాన్లో వచ్చిన భూకంపానికి సంబంధించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.