సత్యసాయి జిల్లా కోడికొండ చెక్పోస్ట్ వద్ద భారీ నగదు పట్టుబడింది. సుమారు కోటి 75లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ ముగ్గురు అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన వారిగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న ధనుంజయ రెడ్డి, ముత్యాలప్ప, ప్రదీప్లను చిలమత్తూరు పోలీసులు విచారిస్తున్నారు. నగదును రెవెన్యూ అధికారుల సమక్షంలో ఐటీ శాఖ అధికారులకు డీఎస్పీ అప్పగించారు. ఇక తనిఖీల్లో పట్టుబడ్డ నగదుకు ఇప్పటివరకు ఎలాంటి ప్రూప్లు తీసుకురాలేదని పోలీసులు స్పష్టం చేశారు.