ఉచిత విద్యుత్ పై బీఆర్ఎస్ మంత్రులకు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వదని బీఆర్ఎస్ పేక్ ప్రచారం చేస్తోందని..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు. 24 గంటల కరెంట్ వెనుక ఉన్న అవినీతి గురించే కాంగ్రెస్ మాట్లాడిందిని దాన్ని వక్రీకరించి చూపుతున్నారని అన్నారు. అసలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసనలకు కేటీఆర్ పిలుపునివ్వడం..చూస్తే వారు ఖచ్చితంగా ఓడిపోతున్నారని తెలుస్తోందని అన్నారు.