ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సెకెండ్ ఏఎన్ఎంలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. విడతలవారిగా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తమను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ కు తమ బాధ చెప్పుకోవడానికి వస్తే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమంటూ మండిపడ్డారు. 15ఏళ్లుగా సెకెండ్ ఏఎన్ఎంలుగా పని చేస్తున్నామని తమను తక్షణమే క్రమబద్ధీకరించాల్నారు.