బాలీవుడ్స్టార్ హీరో అక్షయ్కుమార్కు కేంద్రం భారత పౌరసత్వాన్ని అందించింది. స్వాతంత్ర దినోత్సవం రోజున ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 'మనసు, పౌరసత్వం రెండూ హిందుస్థాన్వే. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!' అంటూ ఓ పోస్ట్పెట్టారు. దీన్ని చూసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.