అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఆగస్టు 31 వరకు మొత్తం 62 రోజులపాటు జరుగనునున్న ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యాత్ర కు అన్ని ఏర్పాట్లు చేసింది జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగం. భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. డ్రోన్లతో నిఘా ఉంచారు. ఉగ్రదాడులు జరగొచ్చనే నిఘా విభాగం హెచ్చరికలతో ఎక్కడికక్కడ సైనికులను భారీగా మొహరించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టారు