సింగపూర్ తరహాలో మూసీ నదిపై బ్రిడ్జీలు నిర్మిస్తామన్నారు బీఆర్ఎస్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్... హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. కాచిగూడ డివిజన్లోని బర్కత్ పుర హౌసింగ్ బోర్డు కాలనీ పార్కును ప్రారంభించారు. 52 కోట్ల నిధులతో మూసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జీలను సింగాపూర్ తరహాలో నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమారమేష్ యాదవ్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.