రణబీర్ కపూర్ అభిమానులకు మరోసారి నిరాశ చెందారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న రణబీర్ కపూర్ మూవీ యానిమల్ డిసెంబర్ 11న విడుదల కానుంది. వాస్తవానికి ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ కావాలి. అయితే… ఆగస్టులో సన్నీ డియోల్ తీస్తున్న గదర్ సీక్వెల్తో పాటు అక్షయ్ కుమార్ నటించిన ఓఎంజీ సీక్వెల్ మూవీలు విడుదల అవుతున్నాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. యానిమల్ మూవీని డిసెంబర్ నెలలో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని... దీంతో సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.