మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇష్టానుసారం సీఐడీ సోదాలు, అరెస్ట్లపై హైకోర్టులో మార్గదర్శి పిటిషన్ వేసింది. తనిఖీలు ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పిటిషన్పై విచారించిన ఏపీ హైకోర్టు.. రెండు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. తక్షణమే అరెస్ట్, సోదాలు నిలిపివేయాలని ఆదేశించింది.. మార్గదర్శి విషయంలో తండ్రి బాటలోనే వెళ్తున్న జగన్.. ఆ సంస్థపై కక్షగట్టారని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి.