ఆంధ్రప్రదేశ్ లో పదో పరగతి పరీక్షల ఫలితాలు రేపు(సోమవారం) విడుదల కానున్నాయి.ఈనెల 22న ఉదయం 11 గంటలకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఏపీలో పది పరీక్షలకు దాదాపు 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.