సత్యసాయి జిల్లాలో పలువురు వాలంటీర్ల తీరు వివాదాస్పదం అవుతుంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పంచాయతీ సర్పంచ్.. వార్డ్ మెంబర్ స్థానాల భర్తీకి ఈనెల 19న పోలింగ్ జరగనుంది. మడకశిర నియోజకవర్గంలోని ఆగలి మండలంలో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో ఐదుగురు వాలంటీర్లు పాల్గొన్నారు. వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రలోభాలకు చేశారు. అధికారులు ఏం చేస్తున్నారని విపక్షాలు నిలదీస్తున్నాయి.