తెలంగాణవ్యాప్తంగా ఆయుష్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. గత ఏడు రోజులుగా ఆయుష్ కాలేజీల దగ్గర నిరసన చేస్తున్నారు. 2014 లో ఇచ్చిన GO ప్రకారం తమకు స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా టైంలో కూడా వైద్యసేవలందిచామని, అయితే తమకు గత ఏడాది డిసెంబర్ నుండి స్తైఫండ్ అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయుష్ డాక్టర్లు. పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని లేదంటే నిరవదిక సమ్మె చేస్తామని డిమాండ్ చేస్తున్నారు.