వరంగల్ బీజేపీ విజయ సంకల్ప సభ వేదికగా ఎమోషనల్ అయ్యారు బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్.ప్రపంచమే మోదీని బాస్గా గుర్తిస్తోందన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత మోదీదే అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగిందంటున్న కేసీఆర్..మోదీ సభకు వచ్చి మాట్లాడాల్సిందని అన్నారు. ప్రధాని సభకు వచ్చేందుకు కేసీఆర్కు ముఖం లేదన్నారు. ప్రధాని మోదీ వస్తే కేసీఆర్కు జ్వరం వస్తుందన్న సంజయ్.. కిషన్రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ గడీలు బద్దలు కొడతామని ధీమా వ్యక్తం చేశారు.