బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్...ప్రధాని మోదీని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నివాసానికి వెళ్లారు సంజయ్. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత సంజయ్.. ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతో కష్టపడ్డారని సంజయ్ను అభినందించారు ప్రధాని మోదీ. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని.. ఆ దిశగా మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. సంజయ్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ.