ఆటోలో ఉన్న ప్రయాణికుల నుండి బంగారం దోపిడీ చేసిన ఘటన, కాకినాడ జిల్లాలో కలకలం సృష్టించింది. సామర్లకోట నుండి పిఠాపురం వైపు వెళ్తున్న ఆటోను దారి దోపిడి చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు దొంగలు ఆటో డ్రైవర్పై కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ప్రయాణిలను గన్లతో బెదిరించి మహిళల వద్ద నుండి బంగారు ఆభరణాలు అపహరించారు బీహర్ కు చెందిన దొంగలు.