భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. అమిత్ షా సభకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు సత్యనారాయణ రాజీనామా చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ను కలిశారు. కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని.. సంక్షేమ పథకాలు బాగున్నాయని కోనేరు సత్యనారాయణ తెలిపారు. అందుకే బీఆర్ఎస్లో చేరాలనుకుంటున్నానని.. ఈ నెలాఖరులో పార్టీలో చేరతానన్నారు. కొత్తగూడెంలో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితను కూడా కలిశారు సత్యనారాయణ.