బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్కు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ శివారు లష్కర్గూడలో బూరను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో తమగ్రామాన్ని ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. దీంతో గ్రామంలో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇక అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ముంపు గ్రామాల్లో బూర నర్సయ్యగౌడ్ పర్యటించారు.