బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ దూకుడు పెంచారు. బీజేపీ ప్రభుత్వం రాగానే పేద భార్యాభర్తలిద్దరికీ పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. బెల్ట్ షాపులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. పేదల పిల్లలకు నాణ్యమైన ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తామన్నారు. ప్రతి పేద కుటుంబానికి రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందించే జిమ్మేదార్ బీజేపీదని స్పష్టం చేశారు. తాను తెలంగాణ అంతరంగం,సమస్యలు తెలిసినవాణ్ని అని తెలిపారు. కేసీఆర్ బలం, బలహీనతలు తెలుసన్నారు. కిషన్రెడ్డి అనుభవమున్న నాయకుడని ఆయనతో కలిసి పనిచేస్తామని అన్నారు.