ఢిల్లీలో విపక్షాల కూటమి ఇండియాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు బీజేపీ ఎంపీలు.పార్లమెంట్ ముందు ఉన్న గాంధీ విగ్రహాం ముందు... నిరసన తెలిపారు. క్విట్ ఇండియా అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. కాంగ్రెస్ తో పాటు విపక్షాల తీరును ఖండించారు బీజేపీ ఎంపీలు. అవినీతికి కేరాఫ్ గా ఉన్న కాంగ్రెస్ ....ఇప్పుడు అవిశ్వాసం పేరుతో.. రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు.