తెలంగాణలో 30శాతం వాటాల ప్రభుత్వం నడుస్తోందని కిషన్రెడ్డి ఆరోపించారు. దళితబంధు పేరుతో కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పొదుపు సంఘాల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే... పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు వస్తాయన్నారు. నాలుగునెలల్లోనే ప్రగతిభవన్ కట్టుకున్న కేసీఆర్కు పేదల ఇళ్లపై చిత్తశుద్ధి లేదన్నారు. ఇందిరాపార్క్ దగ్గర జరిగిన మహాధర్నాలో కిషన్రెడ్డి, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శల చేశారు.