నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ వివాహితను బెదిరించిన 30 లక్షల వసూలు చేసింది ఓ ముఠా. కాలేజీ రోజుల్లో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతామంటూ...కర్నూలు చెందిన గణేష్ నాయక్ బెదిరించి 30 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అనేక దఫాలుగా 30 లక్షల రూపాయలు ఆన్లైన్లో పంపించింది బాధితరాలు. ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో...పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గణేష్, గంగాధర్తో పాటు ఓ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.