పాలపొంగులా గలగలపారుతున్న బోగత జలపాతం చూపరులను కనువిందు చేస్తుంది. ప్రకృతి అందాలను అశ్వాదించేందుకు పర్యాటకుల క్యూ కడుతున్నారు. ములుగు జిల్లాలో తెలంగాణ నయాగరాగా పేరొందిన బోగత జలపాతం అందాలను చూసేందుకు రెండు కళ్ళు చాలా ఉన్నట్టు ప్రకృతి రమణీయత కనిపిస్తుంది. వర్షం వరదల నేపథ్యంలో గత మూడు రోజులుగా జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతించని అటవీ శాఖ అధికారులు వర్షాలు తగ్గడంతో శుక్రవారం నుంచి అనుమతి ఇవ్వడం, అటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో సందర్శకుల తాకిడి పెరుగుతుంది.