24 గంటల కరెంట్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలతో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వార్ నడుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పొలిటికల్ అటాక్కు దిగుతోంది. అటు.. గులాబీనేతలకు కాంగ్రెస్ సైతం ధీటుగా కౌంటర్ ఇస్తోంది. రేవంత్ వ్యాఖ్యల్ని వక్రీకరించి చెబుతున్నారంటూ విమర్శిస్తున్నారు. 24 గంటల కరెంట్ ప్రచారం... కేవలం బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనం కోసమేనంటూ ఫైర్ అవుతున్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటల కరెంటు రావడం లేదన్నారు కాంగ్రెస్ నేతలు.