బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటనకు సిద్ధం కావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం కేసీఆర్ ఈ నెల 21వ తేదీన మొదటి జాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్లో అసమ్మతి, ఆశావాహుల పోరు ఎక్కువైంది. కొందరు హైదరాబాద్ బాట పడుతుంటే.. మరికొందరు ఆందోళనలు చేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏకంగా రాజశ్యామల యాగం చేస్తున్నారు. టికెట్ల వ్యవహారంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు.