దేశీయంగా తయారు చేసుకునే వీలు ఉన్న వస్తువుల దిగుమతులను కట్టడి చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల ఎలక్ట్రానిక్ వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా వీటి ఉత్పత్తిని ప్రోత్సహిస్తూనే... వీటి దిగుమతిపై ఆంక్షలు విధించాలని భావిస్తోంది. లాప్ట్యాప్లతోపాటు పీసీల దిగుమతిపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం...ఇప్పుడు ఇతర వస్తువులపై కూడా దృష్టి పెట్టింది.జనం అత్యధికంగా దిగుమతి చేసుకునే వస్తువులపై ఆంక్షలు విధించాలని కేంద్రం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.