జగన్‌ పాలనలో రవాణారంగం కుదేలయ్యింది: నారా లోకేష్‌

Update: 2023-08-20 10:17 GMT

జగన్‌ పాలనలో రవాణారంగం కుదేలయ్యిందని విమర్శించారు నారా లోకేష్‌.. యువగళం పాదయాత్రలో భాగంగా విజయవాడ ఆటోనగర్ కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు నారా లోకేష్.. ఎంతో చరిత్ర ఉన్న విజయవాడ ఆటోనగర్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేశారని ...కార్మికుల పోరాటంతోనే జగన్‌ వెనక్కి తగ్గారన్నారు. అధికారంలోకి వచ్చాక రవాణారంగానికి పునర్‌వైభవం తీసుకొస్తామని చెప్పారు. మరమ్మతుల పేరుతో జగన్‌ ప్రభుత్వం వ్యాట్‌ పెంచింది కానీ.. ఒక్క రోడ్డుకు కూడా మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని పనులను ప్రక్షాళన చేస్తామన్నారు.

Tags:    

Similar News