సీఎం జగన్ పర్యటనలో నగరి వైసీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం జగన్ శిలాపలకం ప్రారంభించిన తర్వాత సభాస్థలి వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వేదిక వద్ద వైసీపీ నేత కేజే శాంతితో మంత్రి రోజాను కలిపే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ఇద్దరూ చేతులు కలపాలని సూచించారు. అయితే వీరిద్దరూ దీనికి అంగీకరించలేదు. వీరిద్దరిని కలిపేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తుండగా రోజా తన చేతిని వెనక్కు తీసుకున్నారు. సీఎం సమక్షంలో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడటం ఆసక్తిగా మారింది.