తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీలో జయశంకర్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసా రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళి అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.