సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నూతన మెడికల్ కాలేజ్ భవనం, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. కాసేపట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, కలెక్టరేట్ను ప్రారంభిస్తారు. అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తర్వాత ప్రగతి నివేదన సభలో పాల్గొంటారు. కొత్త మార్కెట్ యార్డు వెనకాల 50 ఎకరాల స్ధలంలో దాదాపు లక్ష మందితో సూర్యాపేట ప్రగతి నివేదన సభ తలపెట్టారు. దీని కోసం భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.