ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు అసమ్మతి సెగ తగులుతోంది. కొమరోలులో రాజన్న భోజనశాల ఏర్పాటు చేశారు వైసీపీ నేత రమణారెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరైయ్యారు. స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం పంపలేదు. కోట్లు ఖర్చుతో భారీ స్థాయిలో జన సమీకరణతో పాటు హెలీకాప్టర్ ద్వారా పూల వర్షం కురిపిస్తూ హంగామా చేశాడు. ఐతే ఇటీవల అట్టహాసంగా పుట్టినరోజు జరుపుకున్న అన్నా రాంబాబుకు కౌంటర్గా ఈ కార్యక్రమాలు చేపట్టారని వైసీపీ నేతలు చర్చించుకుంటారు.