విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్చ్ పేరుతో పాదయాత్ర నిర్వహించారు. గాజువాకలోని జింక్ గేట్ నుంచి స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వరకు పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రలో ఏపీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ భూములతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నాయని రుద్రరాజు మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటామని చెప్పారు.