ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 52 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా నిజామాబాద్ అర్బన్లో 12 మంది, బాన్సువాడ టికెట్ కోసం 12 మంది ఆశావహులు పీసీసీకి దరఖాస్తు చేశారు. జిల్లాలో ఒక్క చోట కూడా మహిళలు దరఖాస్తు చేయడానికి ముందుకు రాలేదు.