అనంతపురం సెబ్ పోలీసులపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. వైసీపీ నేతలు తీవ్ర ఒత్తిళ్లు పెట్టడంతో.. కేసు విత్ డ్రాకు కానిస్టేబుల్ రాధమ్మ సిద్దమైంది. ఇందుకోసం ఆమెతో పాటు భర్త.....అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ వచ్చారు. అయితే... ఇప్పటికే వైసీపీ నేతల దాడిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. దీంతో.... కేసు విత్ డ్రా చేసుకునేందుకు వీలు లేదన్నారు టూటౌన్ సీఐ. లోక్ అదాలత్లో కేసును రాజీ చేసుకోవాలని సూచించారు పోలీసులు.