పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్పై స్పందించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బీజేపీ, టీడీపీతో కలిసి పవన్ వైసీపీని ఓడించాలని అనుకుంటున్నారన్నారు. గతంతో ప్యాకేజీని పవన్ పాచిపోయిన లడ్డుతో పోల్చారని విమర్శించారు. బీజేపీ విభజన హామీలను సైతం అమలు చేయడం లేదన్నారు. క్యాపిటల్ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే అని ఎద్దేవా చేసారు. వైజాగ్ స్టీల్ప్లాంట్ దొంగ చేతికి ఇచ్చినా 3లక్షల కోట్లు వస్తాయని, కేవలం 30వేల కోట్లకే ఆదానికి ఇచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.