బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాట్ కామెంట్స్ చేశారు.బీజేపీతో ఒప్పందంలో భాగంగానే..కేసీఆర్ వామపక్షాలను దూరం పెట్టారని ఫైర్ అయ్యారు. మునుగోడులో ఉప ఎన్నిక గెలుపు కోసం తమను వాడుకొని,తర్వాత దూరం పెట్టారని కూనంనేని అన్నారు.సీపీఎంతో కలిసి ఎన్నికలకు వెళ్తామని,ఉమ్మడి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే కాంగ్రెస్తో కలసి వెళ్లాలన్న చర్చలు జరగలేదని అన్నారు.