Andhra Pradesh: అమరావతే రాజధాని.. సీపీఐ బస్సు యాత్ర

Update: 2023-08-26 08:57 GMT

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సీపీఐ బలంగా నినదిస్తోంది. రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో బస్సు యాత్ర తుళ్లూరుకు చేరుకుంది. వీరికి అమరావతి రైతులు ఘనంగా స్వాగతం పలికారు. రాజధాని లేక నడిరోడ్డున నిలబడ్డ ఆంధ్ర జాతికి.. తమ బ్రతుకు ముడుపును కట్టి 34 వేల ఎకరాల భూమిని త్యాగం చేసి.. రైతులు దగాపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు యాత్ర సందర్భంగా రాష్ట్రాన్ని కాపాడండి.. దేశాన్ని కాపాడండి అంటూ నినదిస్తున్నారు.

Tags:    

Similar News