ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో మళ్లీ కదలిక వచ్చింది. లిక్కర్ స్కాంలో సీబీఐ నమోదు చేసిన కేసులో అప్రూవర్గా మారిన వ్యాపారవేత్త దినేష్ అరోరాను.. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్ట్ చేసింది. అరోరా ద్వారానే సౌత్ గ్రూప్ నుండి.. మనీష్ సిసోడియాకు ముడుపులు అందాయని అభియోగం ఉంది. మనీష్ సిసోడియాకు మరిన్ని చిక్కులు తప్పలా లేవు. లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో.. ఇప్పటికే అరెస్టయిన మనీష్ సిసోడియా.. బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.