టీడీపీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావుకి భారతరత్న ఇవ్వాలన డిమాండ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశాడు. ఇటీవలే జరిగిన ఎన్టీఆర్ శత శయంతి నేపధ్యంలో డిమాండ్ మరింత పెరిగింది. ఎన్టీఆర్ శతజయంతి స్మారక వంద రూపాయిల నాణెం విడుదల చేశారు.ఎన్టీఆర్ తెలుగు సినీ వినీలాకాశంలో ఓ సంచలనమని,రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఆయనో ప్రభంజనమని ఆయన పేరు తెలుగువాడి ఆత్మగౌరవమని దర్శకేంద్రుడు ప్రసంశించారు.