సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని కోమటి చెరువు ఇవాళ మరో అద్భుత ఘట్టానికి వేదికకానుంది. 450 డ్రోన్లతో సిద్దిపేట అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా మెగా డ్రోన్ షో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు వీక్షించనున్నారు. ఇవాళ మంత్రి హరీష్ సమక్షంలో డ్రోన్ షో జరగనుంది. సాయంత్రం డ్రోన్ షో కనువిందు చేయనుంది. భూమి నుంచి వంద మీటర్ల ఎత్తులో కాంతి వెలుగులో సిద్దిపేట అభివృద్ధిని ఆవిష్కరించనున్నారు. సినీ గాయనీ గీతామాధురి బృందం ఆట పాటలతో అలరించనున్నారు.