రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 400 మెఫెంటెర్మైమన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సీజ్ చేశారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. వట్టెపల్లి, దుర్గానగర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. జిమ్ ట్రైనర్ నితీష్, రాహుల్తో పాటు సోహెల్లను అరెస్ట్ చేశారు అధికారులు. పట్టుబడ్డ ఇంజక్షన్లు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ప్రధాన సూత్రధారి ఎవరన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు డ్రగ్స్ అధికారులు.