హైదరాబాద్ ఈఎస్ఐ స్కామ్లో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈఎస్ఐలో 211 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ధారించింది. మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు 11 మందిపై అభియోగాలు మోపింది. మెడికల్ పరికరాల కొనుగోలు పేరుతో అక్రమాలు జరిగాయని నిర్ధారించింది. దేవికారాణి హవాలా, మనీలాండరింగ్కు పాల్పడ్డారని.. హవాలా రూపంలో పెద్ద మొత్తంలో నగలు, నగదు తీసుకున్నట్లు అభియోగం మోపింది. ఈ స్కాంలో దేవికారాణితో పాటు ఏడుగురు ఉద్యోగుల పాత్రను ఈడీ ప్రస్తావించింది.