కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన.. అస్తవ్యస్తంగా జరుగుతోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. నర్సీపట్నంలో పరిశీలన మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 262 బూత్లకు గాను 90 చోట్ల మాత్రమే పరిశీలన చేశారన్నారు. బీఎల్వోలు రోజూ కేవలం 3 నుంచి 20 ఓట్లే పరిశీలిస్తున్నారని ఆరోపించారు. కొందరైతే ట్యాబ్లో నమోదు చేయకుండా.. పుస్తకాలపై రాస్తున్నారన్నారు. దీనిపై కలెక్టర్ దృష్టి సారించాలని కోరారు.