Modi Roadshow: వడోదరలో ప్రధాని మోదీ రోడ్ షో
పూలు చల్లిన కల్నల్ ఖురేషి కుటుంబం;
ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్లోని వడోదరలో రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షో సమయంలో.. ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషికి చెందిన కుటుంబం.. మోదీపై పూలు చల్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్ చేరుకున్నారు. మే 8వ తేదీన ఆపరేషన్ సింధూర్ గురించి మీడియాతో కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడిన విషయం తెలిసిందే. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. అయితే ఆ సైనిక చర్యపై కల్నల్ సోఫియా అప్డేట్స్ ఇచ్చారు. గుజరాత్ రోడ్షోకు చెందిన ఫోటోలను ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.