విశాఖలో ఫిషింగ్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ సమీపంలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. టెర్మినల్కు భూములు అప్పగించిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ టెర్మినల్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. 2002లో విశాఖ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు సమయంలో ఒక్కో కుటుంబానికి 60 గజాల ఇంటి స్థలం, రూ.లక్ష పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని.. వాటిని అధికారులు నెరవేర్చాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఆందోళనకారుల ధర్నా దృష్ట్యా కంటైనర్ టెర్మినల్కు వెళ్లే ప్రధాన మార్గాన్ని మార్గాన్ని పోలీసులు దిగ్బంధించారు.