అల్లూరి జిల్లా వీఆర్ పురం మండలం చొప్పల్లిలో వరద బాధితులు ఆందోళనకు దిగారు. గిరిజన గ్రామాలు మునిగిపోతే అధికారులు పట్టించుకోవడం లేదని వినూత్నంగా నిరసన తెలిపారు. నీళ్లలోనే నిల్చొని నినాదాలు చేశారు. నిత్యావసర వస్తువులైనా అందించాలని వేడుకున్నారు. కనీసం వచ్చే ఏడాది వరదలొచ్చేలోపైనా.....పోలవరం ప్యాకేజీ ఇచ్చి పునరావాసాలు కల్పించాలని కోరారు.